
మాజీ మంత్రి పెద్దిరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల ఆక్రమణ విషయంలో క్రిమినల్ కేసుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే.