జపాన్ తీరాన్ని తాకిన సునామీ

576చూసినవారు
జపాన్ తీరాన్ని తాకిన సునామీ
జపాన్ ప్రజలు నూతన సంవత్సరం రోజున భయంభయంగా గడుపుతున్నారు. ఇప్పటికే 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఇషికావా ప్రాంతంలోని వాజీమా పోర్టును సునామీ తాకింది. ఆ ప్రాంతంలో 1.2 మీటర్ల ఎత్తులో భారీగా అలలు ఎగసిపడుతున్నాయి. సునామీ అలలు 5 మీటర్ల ఎత్తుతో తీరాన్ని తాకుతాయని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రభుత్వం సూచించింది.

సంబంధిత పోస్ట్