హర్యానాలోని గురుగ్రామ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థులతో వెళ్తున్న కారు అదుపు తప్పి పిల్లర్ను ఢీకొంది. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీడీ గోయెంకా యూనివర్శిటీ, కేఆర్ మంగళం యూనివర్సిటీ విద్యార్థులు అక్షిత్ (18), దక్ష్ (19) తమ స్నేహితుడు ధ్రువ్తో కలిసి కాలేజీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్షిత్, దక్ష్ అక్కడికక్కడే మృతి చెందారు. ధ్రువ్కు తీవ్ర గాయాలయ్యాయి.