దేశ మహిళల శౌర్య చరిత్రలో తన పేరును సుస్థిరం చేసుకొన్న వీరనారి జెడింగీ (72)కి మిజోరం ప్రజలు శనివారం ఘనంగా నివాళులర్పించారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని లుంగ్లేయీ జిల్లా బువార్పుయీ గ్రామవాసి అయిన ఈమె 46 ఏళ్ల కిందట గొడ్డలితో పులిని చంపి వార్తల్లో నిలిచారు. సుదీర్ఘకాలం క్యాన్సర్తో పోరాడి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. జెడింగీ కుటుంబానికి ఆ రాష్ట్ర సీఎం లాల్దుహోమా సంతాపం తెలిపారు.