వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని యాబాజీ గ్రామంలో సోమవారం జెడ్పిహెచ్ఎస్ చిట్యాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో బడి బాటకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇంటింటి సర్వే నిర్వహించి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య ఉంటుందని తెలిపారు.