రాష్ట్రంలోని పేదింటి పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే బంగారం లాంటి సాయం అందించేందుకు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలంతో పాటు పెద్దేముల్ మండలంలోని కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. మొత్తం 237 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 2 కోట్ల 37లక్షల 27వేల 492ల చెక్కులు పంపిణీ చేశారు.