వరుస మరణాలతో ఇల్లు ఖాళీ చేస్తున్న గ్రామస్తులు!

84చూసినవారు
వరుస మరణాలతో ఇల్లు ఖాళీ చేస్తున్న గ్రామస్తులు!
నల్గొండ జిల్లా, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో ఏడాది కాలంలో సుమారు 74 మంది వివిధ కారణాలతో మృతి చెందారు. గ్రామంలో ఎక్కువగా యువకులే మరణించడంతో ఊరికి కీడు సోకిందని గ్రామస్థులు భావించారు. పండితుల సూచన మేరకు గ్రామాన్ని వదిలి రోజంతా పొలాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో గురువారం ఉదయాన్నే ఇళ్లకు తాళాలు వేసి ఊరి శివార్లలో వనవాసానికి వెళ్లారు. దీంతో శెట్టిపాలెం మొత్తం నిర్మానుష్యంగా మారింది.

సంబంధిత పోస్ట్