Jul 16, 2024, 05:07 IST/ములుగు
ములుగు
ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం
Jul 16, 2024, 05:07 IST
ములుగు జిల్లాలో మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జేఏండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో విడుదలైన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకుందామని ఆలేఖలో పేర్కొన్నారు. ప్రజలపై కొనసాగుతున్న విప్లవ ప్రతి ఘాతుక కుమార ఆపరేషన్ ను ప్రజా ఉద్యమాల ద్వారా ఓడిద్దామన్నారు. మావోయిస్టులపై నిషేధ ఆజ్ఞలు విధించడం తగదని హెచ్చరించారు.