జనగాం జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల, పటేల్ గూడెం, చీటూర్ ఐకేపీ కేంద్రాలు, కుందారం పీఏసీఎస్ లను జనగాం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. కనీస మద్దతు ధరపై రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వివరించారు. అలాగే ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.