పట్టించుకోకుంటే ప్రాణాలకు ప్రమాదమే

67చూసినవారు
పట్టించుకోకుంటే ప్రాణాలకు ప్రమాదమే
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారు మల్లేడి భద్రయ్యకు చెందిన వ్యవసాయ భూమిల్లోంచి వ్యవసాయ మోటార్లకు సరఫరా చేసే విద్యుతు తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదకంగా మారాయి. విద్యుతు శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో రైతు నాలుగు నెలల కిందట స్వయంగా కర్రను నెలకొల్పారు. గాలి దుమారం వస్తే ప్రమాదాలు జరిగే పరిస్థితులున్నాయి. అధికారులు పరిశీలించి మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్