మేడారం జాతర విషయంలో భక్తులు ముందస్తుగా ఆలోచిస్తున్నారు. మహా జాతరకు ఇంకా 25 రోజుల సమయం ఉన్నప్పటికీ ఉద్యోగులకు/స్కూల్స్ సెలవులు రావడంతో జాతర సమయంలో దర్శనం ఇబ్బందికరంగా మారుతుందనే ఉద్దేశంతో శనివారం ముందస్తుగానే వనదేవతలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఆది, బుధ, గురు వారాల్లో 10వేలకు తగ్గకుండా భక్తులు వస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ నుండి సైతం భక్తులు వస్తుండటం విశేషం.