ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్: మంత్రి సీతక్క
ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ నుండి ఏటూరు నాగారం వరకు కాంగ్రెస్ పార్టీ ృమహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మంత్రి సీతక్క బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పేదలకు ఏడాదికి 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.