కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇంచర్ల పిఏసిఎస్ ఛైర్మన్
ములుగు మండలంలోని ఇంచర్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, పిఏసిఎస్ ఛైర్మన్ చిక్కుల రాములు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా డిసిసిబి ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి, తాను స్వచ్ఛందంగా పార్టీలోకి చేరినట్లు రాములు తెలిపారు.