ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ మొబైల్ మెడికేర్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం పరకాల మండలం, కామారెడ్డిపల్లె గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 60 సంవత్సరాలు పైబడిన వయోవృద్దలకు ఉచిత సంచార వాహన వైద్య సేవల ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆరోగ్య శిబిరమును హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి ప్రారంభించి వృద్దులకు వైద్య సేవలు అందించారు.