వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరూరి విశాల్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రజలంతా చూశారని మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మళ్ళీ గెలవడం ఖాయమని తెలిపారు.