వరంగల్ జిల్లా పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్ నాయక్ తండ్రి అమ్రు నాయక్ మరణించడంతో సోమవారం భౌతికాయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట టిపిసిసి లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.