ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం: సీఎం
తెలంగాణలో ముదిరాజులకు, మాదిగలకు సీఎం రేవంత్ రెడ్డి పలు హామీలు ఇచ్చారు. మహబూబ్ నగర్ ర్యాలీలో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాదిగల వర్గీకరణకు పోరాటం చేస్తామన్నారు. అందుకే తనకు జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను అందిస్తే.. ముదిరాజ్లను బీసీ-డీ నుంచి A కు మార్చేందుకు, మాదిగల బాగుకోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.