హైదరాబాద్ మెట్రో సర్వీసు.. హయ్యెస్ట్ అక్యూపెన్సీతో అధిక లాభాలను గడిస్తూ.. విజయవంతంగా తమ సేవలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణాన్ని కల్పించడంతో మెట్రో రైల్కు ఆదరణ కరువైంది. దీంతో 2026 తరువాత హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ను అమ్మేసేందుకు L&T ప్లాన్ చేస్తోంది. మహాలక్ష్మి పథకం కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా L&T సంస్థ డైరెక్టర్ ఆర్.శంకర్ రామన్ వెల్లడించారు.