జిల్లా వ్యాప్తంగా సొసైటీ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి మార్కెట్ కు తెచ్చిన ధాన్యాన్ని రైతుల నుండి వెంటనే కొనుగోలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం మండల కమిటి ఆధ్వర్యంలో మండల పరిధిలోని మగ్దుంపల్లి గ్రామంలోని సోసైటి మార్కెట్ కేంద్రాన్ని పరిశీలన చేసి మాట్లాడారు. మండల కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.