AP: తమ రాజీనామాలు ఆమోదించాలని వైసీపీ ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు మండలి ఛైర్మన్కు ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. తమ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామాలు చేశామని వైసీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. కాగా, పోతుల సునీత, కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్కు విజ్ఞప్తిచేశారు.