టీమిండియాకు హార్దిక్ ప్రత్యేక సందేశం (వీడియో)
ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్లో జరగనుంది. ఈ తరుణంలో టీమిండియాకు భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రత్యేక సందేశం పంపాడు. 'కప్ సాధించేందుకు అడుగు దూరంలో ఉన్నాం. కప్ మన కోసమే కాకుండా కోట్లాది భారతీయుల కోసం గెలవాలి. నా హృదయంతో ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. జైహింద్' అని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. చీలమండ గాయంతో టోర్నీకి హార్దిక్ దూరమయ్యాడు.