గ్రామాల్లో గొడవలకు దూరంగా ఉండండి: ఎస్సై ఖాజా హుస్సేన్
![గ్రామాల్లో గొడవలకు దూరంగా ఉండండి: ఎస్సై ఖాజా హుస్సేన్](https://media.getlokalapp.com/cache/b2/74/b2744065ae1c6c7e9df456def796ca88.webp)
కౌంటింగ్ జరిగే రోజు గ్రామాల్లో గొడవలు జరగకూడదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొంతమందిని బైండోవర్ చేసినట్లు విడపనకల్లు ఎస్సై ఖాజా హుస్సేన్ తెలిపారు. విడపనకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని పార్టీలకు చెందిన సుమారు 100మందిని బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఈ బైండోవర్ ప్రక్రియ జూన్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.