![మిద్దె కూలి అనంతపురం జిల్లాలో దంపతుల మృతి మిద్దె కూలి అనంతపురం జిల్లాలో దంపతుల మృతి](https://media.getlokalapp.com/cache/c8/30/c830eaf6d40cd74309121af04427c813.webp)
మిద్దె కూలి అనంతపురం జిల్లాలో దంపతుల మృతి
అనంతపురం జిల్లాలో ఘోర విషాదం జరిగింది. విడపనకల్ మండలం హవళిగి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ మిద్దె కూలి మారెప్ప (49), లక్ష్మి (45) అనే దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి కూతురు మానస, మృతురాలి తమ్ముడు రాము తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.