Apr 21, 2025, 17:04 IST/
కేకేఆర్పై గుజరాత్ ఘన విజయం
Apr 21, 2025, 17:04 IST
ఐపీఎల్ 2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ జట్టు విజయం సాధించింది. GT ఇచ్చిన 199 పరుగుల లక్ష్యఛేదనలో కేకేఆర్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. KKR బ్యాటర్లలో అజింక్య రహానే (50) అర్థశతకంతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లతో రాణించారు.