ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
శ్రీ సత్యసాయిజిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్ లో గురువారం ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ట చేసారు. పెనుకొండ నియోజకవర్గ తేదేపా అభ్యర్థిని సవిత వితరణ చేసిన ఎన్టీఆర్ విగ్రహంను పెనుకొండ నుండి వాహనంలో సోమందేపల్లికి తీసుకొచ్చారు తేదేపా నాయకులు, గురువారం సవితమ్మ ఆధ్వర్యంలో తేదేపా నాయకులు చంద్ర, సురి, శ్రీనివాసులు, కిష్టప్ప, అనిల్, మోహన తదితరులు విగ్రహన్ని దిమ్మెపై ఉంచారు.