పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహణ
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలోని గార్గేయ నది ఒడ్డున వెలసిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి పలు రకాల అభిషేకాలను చేసి వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.