టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు
![టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు](https://media.getlokalapp.com/cache/ad/a4/ada47c48afbd98796c7032125ea4592d.webp)
తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి సోమవారం చేరికలు జరిగాయి. పుంగనూరు పట్టణంలోని ఎన్ ఎస్ పేటకు చెందిన 50 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై తాము వైసీపీలోకి చేరామన్నారు.