AP: ప్రభుత్వం దీపం-2 పథకం ద్వారా ఏడాదిలో 4 నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ను అందిస్తోంది. దీని కోసం తొలి విడతగా ఈ నెల 31 వరకు బుక్ చేసుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.2,452 రాయితీ ఇస్తోంది. అయితే కొందరికి రాయితీ డబ్బులు జమ కావడం లేదు. ఏమైనా సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. గ్యాస్ ఏజెన్సీల్లో కూడా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఏప్రిల్లో రాయితీ డబ్బులు అకౌంట్లో పడతాయన్నారు.