కమలాపురంలో ప్రారంభమైన శోభాయాత్ర
కమలాపురంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టకు మద్దతుగా శోభాయాత్రని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాల్లో పరిసరాలను పరిశుభ్రం చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. కాషాయ జెండాలు పట్టుకొని గ్రామ సంకీర్తనలు ఆలపించారు. వివిధ కోలాటం భజన బృందాలచే భజనలు నిర్వహించారు. శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.