దస్తగిరి తండ్రి పై దాడి
కడప జిల్లా పులివెందులలోని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తండ్రి షేక్ హజీవల్లి పై శుక్రవారం రాత్రి పలువురు దాడి చేశారు. పులివెందులలో ఆటో నడుపుకుంటూ షేక్ హజీ వల్లి జీవన కొనసాగిస్తున్నాడు. శివరాత్రి సందర్భంగా పట్టణ సమీపంలోని నామాల గుండు వద్దకు వెళ్లాడు. అక్కడ తన పై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారని బాధితుడు తెలిపాడు. ఈ విషయంపై పోలీసులు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.