Apr 19, 2025, 12:04 IST/
పిడుగుపాటు ఘటనలో ఇద్దరు రైతుల పరిస్థితి విషమం
Apr 19, 2025, 12:04 IST
TG: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపురం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపాటుతో 12 మంది రైతులకు గాయలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన రైతులను జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ ఇద్దరు రైతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.