Apr 18, 2025, 16:04 IST/
తెలంగాణలో పిడుగుపాటు.. 12 మందికి గాయాలు (VIDEO)
Apr 18, 2025, 16:04 IST
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలంపురం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పిడుగు పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో రైతులందరూ ధాన్యంపై పరదలు కప్పి ఐకేపీ సెంటర్లో నిలబడ్డారు. అక్కడ ఒక్కసారిగా పిడుగు పడటంతో 12 మంది రైతులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. వారిని వెంటనే 108లో జనగామ ఏరియా అనుపత్రికి తరలించారు. యాదాద్రి జిల్లాలో పిడుగుపాటుకు 50 మేకలు చనిపోయాయి.