రూ.5 వేలకు ఓటు అమ్ముకున్న ఎస్ఐ

71చూసినవారు
రూ.5 వేలకు ఓటు అమ్ముకున్న ఎస్ఐ
డబ్బుకు ఓటు అమ్ముకోవద్దని చెప్పాల్సిన ఎస్ఐ తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్ఐ ఖాజాబాబుకు ప్రకాశం జిల్లా కురిచేడులో ఓటు ఉంది. ఎస్ఐతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5 వేలు తీసుకుని.. ఎస్ఐకి ఆన్‌లైన్‌లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో ఎస్ఐకి నగదు పంపినట్లు తేలింది. ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్