సముద్ర తీర ప్రాంతాలను సందర్శించిన డిఎస్పి
కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోని అలగపాలెం, రామాయపట్నం సముద్ర తీరాలను డిఎస్పి శ్రీనివాసులు ఆదివారం సందర్శించారు. విగ్రహాల నిమర్జనం సందర్భంగా పోలీసు సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. విగ్రహ నిర్వాహకులకు ముందుగానే సూచనలు సలహాలు చేయాలన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రెస్క్యూ, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.