
కందుకూరు: పోగాకు రైతుల సమస్యలు మాట్లాడిన ఎమ్మెల్యే
ఉమ్మడి ప్రకాశం జిల్లా పొగాకు రైతు సమస్యలపై సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో గత సంవత్సరం పొగాకు ధరలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నాయని, ఈ సంవత్సరం రైతు పెట్టుబడులు భారీగా పెరగటం వలన, ధరలు ఆశాజనకంగా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. కావున పొగాకు బోర్డు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు.