చింతాడలో టిడిపి కార్యాలయం ప్రారంభించిన గొండు శంకర్
ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని చింతాడ గ్రామంలో సోమవారం రాత్రి శ్రీకాకుళం శాసనసభ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ఓటర్లకు తనను తాను పరిచయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో టిడిపికి అధిక మెజారిటీ అందించాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులు బోర గోవిందరావు, రందిఅప్పలస్వామి, రాంబాబు, భోర శీను రమేష్ గారయ్య రాజారావు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.