
అత్తిలిలో సిపిఎం వినూత్న నిరసన
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం పాలూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ. వినూత్న రీతిలో రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి నిరసన చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడం సరికాదని మండిపడ్డారు. కావున పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.