Jul 17, 2024, 16:07 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ 12 మంది మావోయిస్టుల మృతి
Jul 17, 2024, 16:07 IST
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్ కౌంటర్ పై మహారాష్ట్ర అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో పెద్దఎత్తున లభించిన ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించారు.