ఎమ్మెల్యే సమక్షంలో జనసేన నుండి వైసీపీలో చేరికలు
వీరవాసరం మండలకేంద్రానికి చెందిన సుమారు 50 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ భీమవరం నియోజవర్గాన్ని అభివృద్ధి చేయడంలో తాను నూటికి నూరు శాతం కృషిచేశానని తెలిపారు.