
భీమవరం: రాజ్యసభ అభ్యర్థి ఖరారు
ఏపీలో రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి.. ఆ పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని బీజేపీ నాయకత్వం అధికారికంగా వెల్లడించింది. నామినేషన్ల గడువు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. కాగా పాక వెంకట సత్యనారాయణ గతంలో భీమవరం కౌన్సిలర్ గా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు.