నేడు విశాఖ-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్
నేడు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. విశాఖ నుంచి సాయంత్రం 04:15 గంటలకు బయల్దేరే స్పెషల్ ట్రైన్(08589) బుధవారం ఉదయం 6:15కి సికింద్రాబాద్ చేరుకోనుంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి రైలు(08590) బుధవారం ఉదయం 10:30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 11:30కి విశాఖ చేరుతుందని పేర్కొంది.