ఇంటర్ విద్యార్థికి యాక్సిడెంట్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటర్ పరీక్ష రాసేందుకు నేరేడికొండ నుంచి బైక్ పై వెళ్తున్న విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొంది. గాయపడిన విద్యార్థిని స్థానికులు అంబులెన్స్ లో ఇచ్చోడ ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.