పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని ఐఐటీ బాబా జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ బాబాపై దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. నోయిడాలో ఐఐటీ బాబాపై హత్యాయత్నం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దాడి తర్వాత బాబా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై పూర్తిసమాచారం తెలియాల్సి ఉంది.