‘చీజ్ కేక్’ బిజినెస్.. రూ.లక్షల్లో సంపాదిస్తున్న యువతి

రాజస్థాన్ రాష్ట్రం జోద్పూర్కు చెందిన పూజా బలానీ వ్యాపార రంగంలో అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తల్లిదండ్రులు పెళ్లి చేయాలనుకోవడంతో పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామనుకొని చీజ్ కేక్ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఆన్లైన్లో చూసి చీజ్ కేక్ తయారీని నేర్చుకొని మొదట చుట్టుపక్కల వారికి రుచి చూపించింది. తర్వాత వరుసగా ఆర్డుర్లు రావడంతో ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రూ.లక్షల్లో సంపాదిస్తుంది.