నా ఓటు వేరేవాళ్లు వేశారు: పుణే కాంగ్రెస్ చీఫ్
ఓటు వేయడానికి వెళ్ళిన పుణే కాంగ్రెస్ పార్టీ చీఫ్ అరవింద్ షిండేకు షాక్ తగిలింది. ఈ మేరకు తన పేరుతో వేరేవాళ్లు ఓటు వేశారని ఆయన వాపోయారు. రాస్తా పేత్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి వెళ్లగా అప్పటికే ఎవరో తన ఓటు వేసినట్లు గుర్తించి షాకయ్యానని చెప్పారు. అధికారులతో మాట్లాడి బ్యాలెట్ పేపర్ల ద్వారా 'టెండర్ ఓటు' వేసినట్లు తెలిపారు. కాగా మహారాష్ట్ర మొత్తంగా ఈరోజు 52.49శాతం ఓటింగ్ నమోదైంది.