కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు మైనారిటీ నాయకులు, మైనారిటీ సోదరులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానందా మాట్లాడుతూ అల్లా దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.