సీతారాంపురంలో చోరీ 12 తులాల బంగారం, 3 లక్షల నగదు అపహరణ

6729చూసినవారు
సీతారాంపురంలో చోరీ 12 తులాల బంగారం, 3 లక్షల నగదు అపహరణ
కారేపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సుడిగాలి విజయభాస్కర్ కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల క్రితం బాసర వెళ్లారు. తన ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు సుమారు అర్ధరాత్రి కారులో వచ్చి తాళం పగలగొట్టి 12 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదును దొంగలించినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు విజయభాస్కర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్