సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
![సింగరేణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం](https://media.getlokalapp.com/cache/22/53/2253c86d50aa8616bfcff73db5bb738f.webp)
సింగరేణి వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని చినరావిగూడెంలో శుక్రవారం మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్ ఆదేశాల మేరకు సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యశిబిరంలో మొత్తం 115 మంది గ్రామస్తులకు సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రమణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.