![సమస్యలు పరిష్కరించాలి సమస్యలు పరిష్కరించాలి](https://media.getlokalapp.com/cache/8b/bb/8bbb459b0be179318a84ad55a2e703e1.webp)
సమస్యలు పరిష్కరించాలి
మణుగూరు మండలం తోగూడెం గ్రామ పంచాయితీలో సోమవారం సామజిక కార్యకర్త కర్నె రవి ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ప్రధాన సమస్యలైన సైడ్ డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, పోడు భూములపై స్థానికులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అధికారులు డ్రైనేజీ, విద్యుత్, పోడు భూముల, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.