మున్సిపల్ ఆస్తుల సమగ్ర సర్వేకు ప్రత్యేక కార్యచరణ
ఇల్లందు ఐదు సంవత్సరాల్లో పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి మున్సిపాలిటీ ఆస్తులు పెంచిందా తగ్గించిందన్న వివరాలు పట్టణ ప్రజలకు తెలుస్తుందనే సదుద్దేశంతో వివరాలు వెల్లడించేందుకు కసరత్తులు మొదలు పెడుతున్నామని మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంది, బిల్డింగులు, వెహికల్స్, తదితర ఆస్తుల వివరాలు సేకరించి ప్రజలకు అతి త్వరలో వెల్లడిస్తామన్నారు.