![ఆన్లైన్ మోసం: రూ. 2. 72 లక్షలు స్వాహా ఆన్లైన్ మోసం: రూ. 2. 72 లక్షలు స్వాహా](https://media.getlokalapp.com/cache/26/9a/269aa507dffbe05ee5dbc077e386159a.webp)
ఆన్లైన్ మోసం: రూ. 2. 72 లక్షలు స్వాహా
ఆన్లైన్ మోసంపై ఇల్లందు పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఇల్లందు పట్టణంలోని సూపర్ బజారుకు చెందిన ఆర్. ధీరజ్ ఫోనుకు ఓ లింకు వచ్చింది. దానిని తెరవగా పెట్టుబడి పెట్టి టాస్క్ పూర్తి చేస్తే రెట్టింపు డబ్బులు వస్తాయని ఉండటంతో రూ. 2. 70 లక్షలు ఆన్లైన్లో చెల్లించాడు. తిరిగి ఒక రూపాయి కూడా రాకపోవడంతో సైబర్ క్రైమ్ వారి సూచన మేరకు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.